పీవీ నగర్లో అక్రమాలకు తెర లేపుతున్న అధికార పార్టీ

సిరా న్యూస్,నంద్యాల;

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు

కాంగ్రెస్ పార్టీ నంద్యాల పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో పీవీనగర్ సదర్శన

దివంగత మాజీ ప్రధాని తెలుగువారి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు నంద్యాల ప్రాంతం నుంచి ఎన్నికై ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన జ్ఞాపకార్థం1994 లో PV. నగర్ 34 ఎకరాలలో 683 ప్లాట్లగాచేసి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది లబ్ధిదారులకు అవసరాల కొరకు అక్కడ పార్కు కూరగాయల మార్కెట్ ,స్కూల్స్, మందిరం ,మసీదు, చర్చి, నిర్మాణాల కొరకు ఖాళీ స్థలాలను వదిలిపెట్టడం జరిగింది ఇప్పుడున్నప్రభుత్వం ఆ ప్రాంత వాసులకు వీటన్నిటిని డెవలప్ చేయకుండా ఆ స్థలాలను ప్లాట్లగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నవారు అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఆప్రాంతాలను కూడా ప్లాట్లగా తయారు చేసి వారు అనుచరులకు ఇవ్వడానికి తయారుచేస్తున్న విధానాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తోందిపీవీ నగర్ ప్రాంతమంతా ఈ ఐదు సంవత్సరాల్లో ఏమాత్రం అభివృద్ధి చేయకుండాఎలక్షన్లో సమీపిస్తున్న కొద్ది వారి అనుచరుల లబ్ది కొరకు అభివృద్ధి పదం పాడుతూ ఆ ప్లాట్లను వారు అనుచరులకు అప్పజెప్పే ప్రయత్నాన్ని విరమించుకోవాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామనితెలియజేశారు
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు, పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య, పట్టణ ఉపాధ్యక్షులు ఆనందరావు, సీనియర్ మైనార్టీ నాయకులు
హమ్మద్ హుస్సేన్, అహ్మద్ భాషా గోరె, మహబూబ్ బాషా, షేక్ సత్తార్, సాయి కృష్ణ, సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *