సిరా న్యూస్, బోథ్
అబద్దాల హామీలకు కేరఫ్ అడ్రస్ కాంగ్రెస్
* ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాల్సిందే
* బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
* బీఆర్ ఎస్ నాయకుల ధర్నా
అబద్దాల హామీలకు కేరఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని, ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాల్సిందేనని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో స్థానిక అంబేత్కర్ చౌక్ లో బీఆర్ ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంఆ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ అబద్దాల హామీలకు కేరఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని, ఇంకా రైతులకు రైతు బందు వెయ్యని మీ ప్రభుత్వనికి రైతులు తొరలో తగిన బుద్ది చెప్తార అని అన్నారు .అదేవిధంగా రైతులకు రెండు లక్షలు రుణమాఫి ఏమైందని ప్రశ్నించారు.పెరుగన్నం తింటున్న రైతుల నోట్లో పురుగుల మందు పోసి అరుగు మీద పడుకోబెడున్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రైతులు తగిన బుద్ది చెప్పాలని అన్నారు. ఎల్ఆర్ఎస్ అంటే ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే అన్న కాంగ్రెస్ నేతలు… ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు డబ్బులు దోపిడీ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఎల్ఆర్ఎస్ వద్దు అంటూ మాట్లాడిన రేవంత్, భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు మౌనం వహించారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు.ఎల్ఆర్ఎస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల మంది పైన కనీసం లక్ష రూపాయల భారం పడనుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ల క్రమభద్దీకరణ చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ కార్యక్రమంలో ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించాలని, లేకుంటే భవిష్యత్తులో న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో
బోథ్ నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.