Rajarshi Shah:రైతు నేస్తం కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి

సిరా న్యూస్,ఆదిలాబాద్‌
రైతు నేస్తం కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి
* జిల్లా పాలనాధికారి రాజర్షి షా
అన్న‌దాత‌కు అండ‌గా నిలిచేందుకు రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ పెట్టిన రైతు నేస్తం రైతులు కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. రైతు వేదికలలో రైతు నేస్తం అనే కార్యక్రమన్ని హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు ప్రారంభించారు.అదిలాబాద్ జిల్లాలో జైనధ్ మండలం రైతు వేదికలో జిల్లా పాలనాధికారి రాజర్షి షా , శాసన సభ్యులు పాయల శంకర్, వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య,, సంబంధిత అధికారులు ,రైతులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో సేవలు అందించడం కోసం రైతు నేస్తం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులకు సీజనల్ వారిగా ఎప్పుడు ఏ పంటలు వేయాలి ఏ ఎరువులు వేయాలి భూమి యొక్క సాంద్రత పంటలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.(26)రకాల పంటల కు వానాకాలం, రభీ సీజన్లో ఏ పంటలు వేయాలి అనే అంశం తెలుసుకోవచ్చని తెలిపారు.పంటలపై బీమా సౌకర్యం* కల్పించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు,వీడియో కాన్ఫరెన్స్ లో అదిలాబాద్ నుండి రైతు గంభీర్ కేంద్రీయ వ్యవసాయం పై వివరించారు.అనంతరం జిల్లా పాలనాధికారి రాజర్షి షా మాట్లాడుతూ ఈ వీడియో కాన్ఫరెన్స్ సిస్టం ను జిల్లాలో నాలుగు మండలాలు జైనధ్ ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లి లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. శాసన సభ్యులతో కలసి మార్కెట్ యార్డ్ లోని సోయా ను పరిశీలించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీసీసీబీ అధ్యక్షులు . భోజారెడ్డి, పీఏసీఎస్‌ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, ఎంపీపీ గోవర్ధన్, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *