సిరా న్యూస్, పెద్దపల్లి:
బాల సదనమ్ నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన..
ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు..
సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని సినీ మల్టిపెక్స్ సమీపంలో నూతన “బాల సదనమ్ (బాలికల) భవనాన్ని మిషన్ వత్యల్య నిధులతో రూ 134.93 నిర్మించనున్న భవనానికి శంఖుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో బాల సదనమ్ బాలికల భవన నిర్మాణం కోసం శంఖుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందిని. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లితండ్రులు లేనటువంటి అనాధలు అయిన 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయస్సు వరకు పిల్లల కోసం ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ భవనాన్ని నిర్మించడం జరుగుతుంది. దాదాపు12 సంవత్సరాల పాటు ఆ పిల్లలకు రెసిడెన్సీ తో పాటు చదువుకునే విధంగా అన్ని సౌకర్యలతో నిర్మించడం జరుగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ చైర్మన్ , ఎంపీపీ, మున్సిపల్ వైస్ చైర్మన్ , మున్సిపల్ కౌన్సిలర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.