Jogu Ramanna: భూములను ఉచితంగా క్రమబద్ధీకరించాలి

సిరా న్యూస్, ఆదిలాబాద్:

భూములను ఉచితంగా క్రమబద్ధీకరించాలి

– మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్

+ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదురుగా బిఆర్ఎస్ శ్రేణులతో ధర్నా

+ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో దోపిడికి తెరలేపిందని విమర్శ

పల్లెలు, పట్టణాల్లోని భూములను ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరించాలని మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న డిమాండ్ చేశారు. గురువారం ఆయన బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ను వ్యతిరేకించిన కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ పేరుతో దోపిడికి తెరలేపిందని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారం లోకి రాగానే మరో మాట కాంగ్రెస్ కే సాధ్యమైందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్, ఇప్పుడు అదే ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం తీరు మార్చుకొని, ప్రజల భూములను ఉచితంగా క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, బిఆర్ఎస్ నాయకులు రౌత్ మనోహర్, రోకండ్ల రమేష్, విజ్జగిరి నారాయణ, అజయ్, దాసరి నారాయణ, స్వరూప రాణి, సాజిదోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *