సిరా న్యూస్,హైదరాబాద్;
మాజీ మంత్రి, బిఆర్ఎస్ నాయకుడు మల్లారెడ్డి కి రెవిన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాటిని కూల్చేశారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి నిర్వహిస్తున్న ఎంఎల్ఆర్ఐటి లో ప్రభుత్వ భూములు ఉన్నాయని గుర్తించిన రెవిన్యూ అధికారులు గురువారం ఉదయాన్నే భారీ బలగాల మధ్య వాటిని కూల్చేశారు.భవానాలను కూలుస్తున్న సమయంలో కాలేజీ సిబ్బంది రెవిన్యూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని హెచ్చరించడంతో సిబ్బంది భవనాలను కూల్చివేత కొనసాగించారు. చెరువు భూమిని ఆక్రమించి నిర్మాణాలను చేపట్టినట్టు రెవిన్యూ అధికారులు వివరించారు.దుండిగల్ ఎంఎల్ఇఆర్టి కాలేజీని చిన్న దామర చెరువులో నిర్మించినట్టు ఆరోపణలు ఉన్నాయి. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాలేజీపై చర్యలు తీసుకోడానికి అధికారులు సాహసించలేదు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలను చేపట్టిన వారిపై కఠిన చర్యలు ప్రారంభించారు.ఈ క్రమంలో మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చిన్నదామర చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారనే అభియోగాలతో భవనాలను కూల్చివేశారు. మేడ్చల్, దుండిగల్ ప్రాంతంలోని బఫర్ జోన్ నిర్మాణాలను తొలగించారు.