సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
వేములవాడ రాజన్న ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్వామి వార్లకి సాయంత్రం పట్టు వస్త్రాలు మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున సాయంత్రమే స్వామి వార్ల కి పట్టు వస్త్రాలు టిటిడి అధికారులు, అర్చక బృందం సమర్పించారు. మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేసారు. దాదాపు 1500 పోలీసుల తో మహా శివ రాత్రి జాతర బందో బస్తు ఏర్పాటు చేసారు. జాతర కోసం 994 ప్రత్యేక ఆర్టీసి బస్సులు కేటాయించారు.