Lakshmareddy: సేవాకు మించిన సంతృప్తి లేదు

సిరా న్యూస్, జైనథ్
సేవాకు మించిన సంతృప్తి లేదు
* కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పోద్దుటూరి లక్ష్మారెడ్డి
* సిమెంట్ బెంచిల విత‌ర‌ణ‌
సేవాకు మించిన సంతృప్తి లేదని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పోద్దుటూరి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్, మేడిగూడ కెనాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పోద్దుటూరి లక్ష్మారెడ్డి సహకారంతో ఇరవై వేల విలువైన ఎడు సిమెంట్ బెంచిలను బస్సు స్టాప్, పాఠశాలలో గ్రామం కూడలిలో ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పోద్దుటూరి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మేడిగూడ కెనాల్ దగ్గర గల బస్ స్టాప్ శిథిలావస్థలో బస్సు కోసం ఎదురు చూసే మహిళల, పిల్లల ఇబ్బందులు గమనించి దానికి మరమ్మత్తు చేసి, ప్రయాణికుల సౌకర్యార్ధం బెంచిలనూ ఏర్పాటు చేశానని అన్నారు. గతంలో కూడా సాత్నల రోడ్ కు ఇరువైపులా ఉన్న మూళ్ళ పొదలను తొలగించే ఏర్పాటు చేశానని అన్నారు. సమాజానికి సేవా చేయడంలో సంతృప్తి ఉందాని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను స్వచ్చందంగా నిర్వహిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడిగూడ కెనాల్ ఉప సర్పంచ్ తూడం పోచ్చన్న, భావానిఆనంద్,‌ పెంటపర్తి ఊశన్న తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *