సిరా న్యూస్,విజయవాడ;
ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అటు అధికార పార్టీ అయిన వైసీపీ నేతల తమదైన శైలిలో ముందుకు వెళ్తుండగా, ఇక ధీటుగా ఎదుర్కొనే టీడీపీ పార్టీ కూడా కొత్త వ్యూహాలు రచిస్తోంది. మొదటి విడతలో 94 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించగా, జనసేన పార్టీ 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారు .మొత్తం 24 స్థానాల్లోనూ ఐదు స్థానాలకు అభ్యర్థులు ఎంపికను పూర్తి చేసింది జనసేన. ఆయా అభ్యర్థుల వివరాలను స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మిగిలిన 19 మంది అభ్యర్థులపై పవన్ కళ్యాణ్ త్వరలో ప్రకటించనున్నారు. అయితే మొదటి జాబితాలో టికెట్ దక్కనివారికి చంద్రబాబు బుజ్జగించే పనిలో పడ్డారు. పవన్ కళ్యాణ్ టికెట్ దక్కని ఆశవాహలు ఒక్కొక్కరుగా చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్నారు. టిడిపికే కాకుండా జనసేనకు టికెట్లు కేటాయించిన స్థానాల్లోని మహిళతోపాటు టిడిపిలో ఒకరి కంటే ఎక్కువ ఆశావహులకు ఉన్న స్థానాల్లోని అభ్యర్థులను కూడా పిలిపించి స్వయంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. టికెట్ రాని వారు ఎలాంటి టెన్షన్ పడవద్దని వారిని బుజ్జగింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదో విధంగా వారికి సర్జి చెప్పి పంపిస్తున్నారట. ఇక బుధవారం మరి కొంతమంది ఆశావహులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనకాపల్లి టీడీపీ ఇన్ చార్జి పీలా గోవింద్ చంద్రబాబును కలిశారు. ఇప్పటికే అనకాపల్లి టిక్కెట్లు జనసేన కేటాయించారు. దీంతో పీలా గోవింద్ కు చంద్రబాబు సర్ది చెప్పారు. మాజీ మంత్రులు కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ లు కూడా చంద్రబాబుతో విడివిడిగా భేటీ అయ్యారు.ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయం మరింతగా వేడెక్కుతోంది. ఎవరికి వారు పవులు కదుపుతున్నారు. ఎలాగైనా ఈ సారి అధికారంలోకి రావాలని టీడీపీ ఉవ్విళ్లూరుతోంది. ఇతర పార్టీలలో ఉన్న నేతలను పచ్చ పార్టీలోకి లాగేందుకు గాలం వేస్తున్నారు. ఇక వసంతకృష్ణ ప్రసాద్, దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు.. ముగ్గురు నేతల మెడలో పసుపు కండువా ఉన్నా ముగ్గురు నేతల తీరు మైలవరం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లకు అంతుపట్టడం లేదు. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ బీఫామ్ అందుకునేది ఎవరు? ఒకరికి టికెట్ లభిస్తే మిగతా ఇద్దరు సహకరిస్తారా? లేదా అన్నది సైకిల్ పార్టీలో చర్చనీయాంశంగా మాఇంది. మారింది. టికెట్ తనకే అని ఆశలు పెట్టుకున్న వసంత కృష్ణప్రసాద్ బొమ్మసాని సుబ్బారావుతో భేటీ అయ్యారు. త్వరలో దేవినేనితోనూ భేటీ అవుతానని నేతలు చెబుతున్నారు. అయితే బొమ్మసాని మాత్రం మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ను టీడీపీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదని అంటున్నారు. ఆయన పెనమలూరుకు వెళ్లడం మంచిదని మా ఇద్దరి మధ్య భేటీలో సూచించానని అంటున్నారు. ఇక మడకశిరలో సునీల్ కుమార్కు టికెట్ ఇవ్వడంపై తిప్పస్వామి వర్గం ఏకంగా ఆత్మహత్యల వరకు వెళ్లడంతో మరింత టెన్షన్ మొదలైంది .టికెట్ సునీల్ కుమార్కు ఇవ్వడంతో తిప్పేస్వామి అనుచరులు మండిపడుతున్నారు. ఈ రోజు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకొని అభ్యర్థిని మార్చాలంటూ డిమాండ్ చేశారు. తిప్పేస్వామికి అన్యాయం చేశారని ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.అయితే సునీల్ కుమార్ వర్షన్ మాత్రం మరోలా ఉంది. సర్వేల ఆధారంగానే తనకు టికెట్ ఇచ్చారంటున్న సునీల్ కుమార్.. తిప్పేస్వామితోనూ తాను మాట్లాడుతామని అంటున్నారు.