సిరా న్యూస్,పాలకొల్లు;
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు.పంచారామ క్షేత్రమైన క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి శివరాత్రి మహోత్సవ శోభ సంతరించుకుంది. వేకువజాము నుంచి భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్ లో వేచి ఉన్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని స్వామి వారికి మూలవిరాట్ కు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. పెద్దసంఖ్యలో విచ్చేసిన భక్తుల శివ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతోంది.
త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్టించబడిన శివలింగం ఇది. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈఆలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ పాసు పతాభిషేకం, లక్షపత్రి పూజ, లక్ష బిల్వార్చన పూజలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమవుతాయి. రాత్రి 8 గంటలకు అఖండ జగత్ జ్యోతిని వెలిగిస్తారు. అర్ధరాత్రి లింగోద్భావ కాలంలో స్వామి వారికి శ్రీశైలం మల్లన్నకు తరహాలో పాగా అలంకరణ జరుగుతుంది.