సిరా న్యూస్,హైదరాబాద్;
ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశారని విశాఖపట్నం ప్రాంతాన్ని దోపిడీ దొంగల వలె కొల్లగొట్టారని సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. హైదరాబాదులో నివాసం ఉండే సత్తెనపల్లి నియోజకవర్గం వాసుల కొరకు కూకట్పల్లి హైదర్ నగర్ ఎన్.ఆర్.ఎస్. ఏ కాలనీలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సైకో జగన్ పాలనకు స్వస్తి పలికి చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవాలని, లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్ లోని పేదల ఇల్లు స్థలాలు లాక్కొని జగన్ వశం చేసుకుంటారన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని…, మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రంలో బ్రతకనిచ్చే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడుని గెలిపించుకుంటే రాజధాని నిర్మాణంతో, పాటు సూపర్ సిక్స్ పథకాలు పేదవారికందరికీ లబ్ధి చేకూరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు.