మోతే శివాలయంలో ప్రత్యేక పూజలు

సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా;
మహాశివరాత్రి సందర్భంగా మోతే శివాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు..ఈ సందర్భంగా భద్రాచల ఆలయ ఈవో మాట్లాడుతూ భక్తులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మోతే గ్రామంలో ఉన్నటువంటి వీరభద్ర స్వామి ఆలయం అంటే గోదావరి నది మధ్యలో ఉన్నటువంటి వీరభద్ర స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకుంటున్నారని నది మధ్యలో ఈ యొక్క ఆలయం ఉండడం అదేవిధంగా 800 ఏళ్ల కాలం కంటే ముందే నిర్మించబడి, గోదావరి ఎంత ఉధృతంగా ప్రవహించినా స్వామివారిని తాకకుండా ప్రవహిస్తూ ఉంటుందని, చాలా విశిష్టత కలిగినటువంటి ఆలయం కావున,దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు..
==================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *