Srimukhalingeshwar Temple ; శ్రీముఖలింగేశ్వర ఆలయంలో వైభవంగా శివరాత్రి వేడుకలు

సిరా న్యూస్,శ్రీకాకుళం;
భారత దేశంలో అత్యంత చారిత్రక నేపధ్యం, పురాణ ప్రాసస్యత కలిగిన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగంలో వెలసిన శ్రీముఖలింగేశ్వర ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న ప్రత్యేక పూజల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుండి విశేషంగా భక్తులు పాల్గొంటున్నారు.
ఈ ఆలయ నిర్మాణం క్రీస్తుశకం 720-1450 వరకు కలింగ దేశమును చాలా కాలం పాలించిన గంగ వంశరాజులు నిర్మించారని చారిత్రిక కథనం. ఆంధ్ర-ఒడిషా సాంస్కృతిక సంపదగా ఈ ఆలయం విరాజిల్లుతుంది. శ్రీముఖలింగం అనగా పరమేశ్వరుని యొక్క ముఖం లింగం కనిపించుట అని అర్థం. ఇది దక్షిన కాశీగా కూడా ప్రసిద్ధి చెందిన పురాతన పుణ్యక్షేత్రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *