సిరాన్యూస్, బేల
బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి
* బీజేపీ మండల అధ్యక్షుడు దత్తా నిక్కం
* సీసీ రహదారులకు భూమి పూజ
బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ మండల అధ్యక్షుడు దత్తా నిక్కం అన్నారు.అదిలాబాద్ జిల్లా బేల మండలంలోని దేవుజ గూడ గ్రామంలో శుక్రవారం ఉపాధి హామీ పథకం కింద రూ.4 లక్షలతో చేపట్టనున్న సీసీ రహదారి పనులకు బీజేపీ మండల అధ్యక్షుడు దత్తా నిక్కం భాజపా నాయకులతో కలిసి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆప్ కీ బార్ మోడీ సర్కార్ నినాదంతో మళ్లీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గ్రామాల్లో మోదీ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో బద్దం ప్రమోద్ రెడ్డి,జీవన్,ఠాక్రే సందీప్,బర్కడే రాము,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు