సిరాన్యూస్, ఓదెల
ఉద్యమకారుల కృతజ్ఞత సభకు ఆహ్వానం
పెద్దపెల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి మహాశివరాత్రి పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమ నాయకులు చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామికి స్వాగతం పలికారు. అనంతరం ఈనెల 12న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే తెలంగాణ ఉద్యమకారుల కృతజ్ఞత సభకు రావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.