సిరా న్యూస్, చిగురుమామిడి:
ఘనంగా బొమ్మనపల్లి లో మహాశివరాత్రి వేడుకలు..
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలోని ఊరా గుట్ట మీద శివాలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంద్భంగా శుక్రవారం మడేలయ్య యూత్ అసోసియేషన్ సభ్యులు పత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పోర్ట్ ఎక్కడంతో శివ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులు ప్రత్యేక పూజలు, పాలాభిషేకం నిర్వహించి ఘనంగా మహాశివ రాత్రిని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాడ తిరుపతిరెడ్డి, శ్రీదేవి జగ్గాని ఆదినారాయణ సంధ్య, కానుగంటి సత్యనారాయణ రెడ్డి, చట్ల శ్రీకాంత్, బొమ్మనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు మాచమల్ల రమణయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చట్ల సమ్మయ్య, నాయకులు కత్తుల దేవేందర్, మడేలయ్య యూత్ సభ్యులు, బండి సంజయ్, మాచమల్ల కిషోర్, కాంగ్రెస్ జిల్లా నాయకులు మిట్టపల్లి ఆదర్శ్, గంప మదన్ మోహన్, ఐకేపీ గంప సంపత్, మడుమడకల రాజిరెడ్డి, ఏనుకొండ శ్రీనివాస్ రెడ్డి, సుకోసి సమ్మయ్య, బండి రాజు, గుజ్జుల మణికంఠ రెడ్డి, కోమిరె కుమార్, బీజేపీ నాయకులు మామిడి రమేష్, అరెళ్ల శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.