సిరా న్యూస్, ఓదెల:
మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కరాటే కళ్యాణి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన మల్లికార్జున స్వామి ఆలయంలో సినీ నటి కరాటే కళ్యాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యఅతిథిగా విచ్చేసిన కరాటే కళ్యాణికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె స్వామి వారిని దర్శించుకుని అభిషేకాలు గావించారు. అనంతరం హరికథ కాలక్షేపం నిర్వహించారు.