సిరా న్యూస్, ఓదేల
సన్మాన కార్యక్రమానికి తరలిరండి
* మోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్
* కరపత్రాల విడుదల
బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ సన్మాన కార్యక్రమానికి ఓదెల మండలంలోని అన్ని గ్రామాల గౌడ కులస్తులందరు తరలిరావాలని మోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం ఓదెల మండలంలోని ఓదెల గ్రామంలో మోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్, జాగిరి అంజి గౌడ్ ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఓదెల గౌడ సంఘం సభ్యులు మార్క సతీష్ గౌడ్, శ్రీపతి మహేష్ గౌడ్, మార్క సదానందం గౌడ్ ,ఐలి శ్రీనివాస్ గౌడ్, పోతుగంటి మహేష్ గౌడ్, ముంజల మహేందర్ గౌడ్, మాచర్ల తిరుపతి గౌడ్, పచ్చిమట్ల స్వామి గౌడ్, పొన్నం రాము గౌడ్, నాగపురి రవి గౌడ నాయకులు పాల్గొన్నారు.