Surendra Babu: గెలుపే ల‌క్ష్యంగా ప‌ని చేయాలి

సిరా న్యూస్, కుందుర్పి
గెలుపే ల‌క్ష్యంగా ప‌ని చేయాలి
* ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు
* సురేంద్రబాబు రాకతో కార్య‌క‌ర్త‌ల్లో నూతన ఉత్సాహం
గెలుపే ల‌క్ష్యంగా కార్య‌క‌ర్త‌లు ప‌ని చేయాలని తెలుగుదేశం-జనసేన ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. శ‌నివారం శెట్టూరు మండలం, ములకలేడు గ్రామంలో ఆయ‌న పర్యటించారు. ఈసంద‌ర్భంగా సురేంద్రబాబుకు పలికిన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం అన్నారు. అనంత‌రం మండలస్థాయి నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజలునాయకులందరినీ ఏకతాటి పైకి తేవడంలో సురేంద్రబాబు సక్సెస్ అయ్యార‌ని కార్య‌క‌ర్త‌లు అన్నారు. అనంత‌రం సురేంద్ర బాబు మాట్లాడుతూ ప్రాజెక్టు, సాగు, త్రాగునీరు, రోడ్లు, ప్రధాన ఏజెండాగా నియోజకవర్గంలో ముందుకు సాగుతున్నామ‌ని తెలిపారు.ఈ కార్యక్రమంలో శెట్టూరు మండల కన్వినర్ టీఆర్‌.తిప్పేస్వామి, పార్లమెంట్ అధికార ప్రతినిధిరామరాజు, ఎంపీటీసీ లింగప్ప, మాజీ ఎంపీపీ బొమ్మయ్య, మాజీ జడ్పీటీసీ కవిత గురుప్రసాద్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు నగేష్, ఉప సర్పంచ్ ఆకుల ఎర్రిస్వామి, మాజీ సర్పంచ్ చెన్నకేశవ్, మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి,తెలుగుయువత సభ్యులు, సభ్యులు, జనసేన మండల అధ్యక్షుడు కాంత రాజు, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, తాజా-మాజీ ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, బూతు ఇంచార్జిలు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *