సిరా న్యూస్, తలమడుగు
ద్యానంతో మానసిక ప్రశాంతత
* పూలాజీ బాబా సంస్థాన్ కుచ్లాపూర్ అధ్యక్షులు పెట్కులే రవీందర్
* ఘనంగా పూలాజి బాబా ధ్యాన మందిర వార్షికోత్సవం
ద్యానంతో మానసిక ప్రశాంతతను పొందాలని పూలాజీ బాబా సంస్థాన్ కుచ్లాపూర్ అధ్యక్షులు పెట్కులే రవీందర్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కుచిలాపూర్ గ్రామంలో శనివారం పులాజి బాబా 28వ ధ్యాన మందిరం వార్షికోత్సవాన్నిఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జండా ఆవిష్కరణ చేశారు. ధ్యాన ధారణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పులాజి బాబా సంస్థాన్ కుచ్లాపూర్ అధ్యక్షులు పెట్కులే రవీందర్ హాజరై మాట్లాడారు. అందరూ బాబా అడుగుజాడల్లో నడుచుకుంటూ బాబా మార్గంలో ప్రయాణించాలని, తద్వారా ధ్యానాన్ని అలవర్చుకొని జ్ఞానంతో పాటు మానసిక ప్రశాంతతను పొందాలని కోరారు.ఈకార్యక్రమంలో బాబా భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.