distribution of Kalyanalakshmi checks : జగిత్యాలలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణిలో ఉద్రిక్తత

కాంగ్రెస్ బిఆర్ఎస్ మద్య ఘర్షణ
 సిరా న్యూస్,జగిత్యాల;
జగిత్యాలలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణిలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ సమక్షంలో ఇరువర్గాలు వాగ్వివాదం.. తోపులాటకు దిగారు. ఎమ్మార్వో ఆఫీస్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ రసాభాసగా మారింది. ప్రోటోకాల్ పై ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల ను సముదయించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ సంక్షేమ కార్యక్రమల గురించి వివరించేప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలుఅడ్డుకున్నారు. ప్రతిగా బిఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో పరస్పరం వాగ్వివాదం జరిగింది. తోపులాటలు, ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజీవ్ లుఇరువర్గాల కార్యకర్తలను సముదయించారుర. జీవన్ రెడ్డి జోక్యంతో అందోళన సద్దుమణిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *