సిరా న్యూస్, గుడిహత్నూర్:
గుడిహత్నూర్ పీహెచ్సీలో ఇష్టారాజ్యం…
– సమయపాలన పాటించని సిబ్బంది
– రోగులతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు
– పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని ఉన్నతాధికారులు
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సిబ్బంది ఇస్తారాజ్యం కొనసాగుతోంది. సమయానుసారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు తరచుగా వినిపిస్తున్నాయి. దీంతోపాటు ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల పట్ల కొంతమంది వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కనీసం డ్రెస్ కోడ్ లేకుండా విధులు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఇక్కడ పనిచేసే కొంతమంది సిబ్బందికి ఉన్నతాధికారుల అండదండలు ఉండడంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ రోగులకు అందుబాటులో ఉండడం లేదని ఆరోపిస్తున్నారు. ఆరోగ్య కేంద్రంలోని పనిచేసే ఓ అధికారి పై ఇప్పటికే పదుల సార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా లాభం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇకనైనా అధికారులు పట్టించుకోని రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.