భువనగిరి కాంగ్రెస్ టికెట్ చామల కిరణ్ కు ఇవ్వాలి

సిరా న్యూస్,భవనగిరి;
భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలని ఓయూ జేఏసీ నాయకులు నరేందర్ పవార్ కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓయూలో మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పటిష్టతకు విశేషమైన కృషి చేశారని తెలిపారు. అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. యువతలో మంచి పేరు ఉన్న నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి అని అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయిస్తే యువత అందరూ ఒక్క తాటిపైకి వచ్చి ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అహర్నిశలు కృషి చేశారని గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *