ఐదుగురికి గాయాలు
సిరా న్యూస్,మేడ్చల్;
దైవ దర్శన్ కి వెళ్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఆటో బోల్తా పడి ఒక్కరు మృతి చెందగా మరో అయిదుగురికి గాయాలైన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం పటాన్ చెరువు లోని బండ్లగుడా కి చెందిన మల్లేష్ తన కుటుంబం తో సిద్దిపేట జిల్లా కోమరేవెల్లి దర్శనానికి వెళ్తుండగా శనివారం మేడ్చల్ చెక్ పోస్ట్ లోని కిష్టాపూర్ రోడ్ హెచ్ పీ పెట్రోల్ బంకు వద్ద పిల్లర్ ఢీకొని ఆటో బోల్తా పడింది. ఆటో డ్రైవర్ మల్లేష్ (40) అక్కడికక్కడే మృతి చెందగా మల్లమ్మ అనే మహిళ కాలు ఫ్రాక్చర్ అయింది మిగిలిన వారి గాయాల చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రి తరలించారు పోలీసుల సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.