Anil Jadhav: ప్రతి ఒక్కరూ భక్తి భావనాలతో మెలగాలి

సిరా న్యూస్,తాంసి
ప్రతి ఒక్కరూ భక్తి భావనాలతో మెలగాలి
* బోథ్ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్
* ఘ‌నంగా శ్రీ లక్ష్మినారసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం
ప్రతి ఒక్కరూ భక్తి భావనాలతో మెలగాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్ అన్నారు. శ‌నివారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని వడ్డాడి గ్రామంలోని శ్రీ స్వయంభూ లింబద్రీ లక్ష్మి నారసింహస్వామి వారిని బోథ్ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్ దర్శించుకున్నారు. అనంత‌రం ప్రత్యేక పూజలు చేశారు.ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ స్వయంభూ శ్రీ లక్ష్మి నారసింహస్వామి వారి దివ్య ఆశీసులు బోథ్ నియోజకవర్గ ప్రజలపై ఉండాలన్నారు. బోథ్ నియోజకవర్గ ప్రజలు ద్యైవ మార్గంలో నడవాలని, ప్రతి ఒక్కరూ భక్తి భావనాలతో మెలగాలని అన్నారు.ఈ కార్యక్రమంలోమండల ప్రజా బీఆర్ ఎస్‌ పార్టీ ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *