సిరా న్యూస్, చిగురుమామిడి
తాళ్ల రాజేందర్కు ఎంజేఎస్ నాయకుల సన్మానం
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన తాళ్ల రాజేందర్ అనే యువకుడు ఇటీవల వెలువడిన గురుకుల టిజిటి ఫలితాల్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. రాజేందర్ నీ మాదిగ జాగృతి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అందే సాగర్ అధ్వర్యంలో శనివారం అంబేద్కర్ చిత్రపటం బహుకరించి శాలువాతో సన్మానించారు.స్వీట్లు పంపిణి చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజేందర్ అనేక కష్టనష్టాలకు ఓడ్చి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం గొప్ప విషయమని అన్నారు.ఉపాధ్యాయుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బెజ్జంకి రవీందర్, కోశాధికారి అంజన్ బాబు, ఆరెల్లి బాబు, సుమన్, అశోక్,హరీష్,
శ్రీకాంత్ నరేష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.