సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం.

సిరా న్యూస్, ఆదిలాబాద్:

సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం..

మాలి మహా సంఘం  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న శేండే..

దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు జ్ఞాన జ్యోతి సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయమని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న శేండే అన్నారు. ఆదివారం అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆవరణలో సావిత్రిబాయి పూలే 128 వర్ధంతిని పురస్కరించుకొని. మహాత్మ జ్యోతిరావు ఫులే దంపతుల విగ్రహాలకు సంఘ నేతలతో కలిసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..స్త్రీ విద్య, మహిళా సాధికారిక, సమసమాజ నిర్మాణం కోసం సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిరావు పూలే సహకారంతో 1848లో మహారాష్ట్రలోని పూణేలో మొదటి మహిళా పాఠశాలను ప్రారంభించి స్త్రీలకు విముక్తి కల్పించిన గొప్ప సామాజికవేత్త సావిత్రిబాయి పూలే అని, బహుజన కులాలన్నీ ఆమె అడుగుజాడల్లో నడిచి సామాజిక న్యాయంతో పాటు సమ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి సతీష్ గురుణులే, జిల్లా కార్యవర్గ సభ్యులు విజయ్ వాడగురే, మాందాడే రామ్ కిషన్, మాందడే జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *