సిరా న్యూస్, సైదాపూర్:
జాతీయస్థాయిలో రాణించాలి..
మంత్రి పొన్నం ప్రభాకర్…
పోతారం గ్రామంలో కృష్ణ కబడ్డీ క్లబ్ జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం చాలా అభినందనీయమనని రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. గ్రామాల నుండి ఆదర్శవంతమైన క్రీడలు నిర్వహించడం వల్ల ఊర్లో చైతన్యం ఉంటుందని అన్నారు.గ్రామలలో యువకులు క్రీడలు బాగా ఆడతారని,ఈ పోటీలు విజయవంతం కావాలని. అంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో రాణించి మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు. చిన్నప్పుడు నేను కూడా కబడ్డీ ఆడే వాడిని అన్నారు తన చిన్ననాాటి జ్ఞాపకాలని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.