భీమదేవరపల్లి, సిరా న్యూస్:
అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి..
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పాల ప్రకాష్…
తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాలయ్య రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయటంలో భాగంగా.హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో గ్రామ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. నేడు చంటయ్యపల్లి గ్రామంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం నూతన కమిటీ వేయడం జరిగింది. అధ్యక్షులుగా అంబాల తిరుపతి ప్రధాన కార్యదర్శి అందే గణేష్,ఉపాధ్యక్షులు లింగాల సంపత్, సహకార్యదర్శి అంది రమేష్, కోఆర్డినేటర్ గిన్నారపు సంపత్, కోశాధికారి అందే దయాకర్, కార్యదర్శి అందే నరేష్ కార్యవర్గ సభ్యులుగా గిన్నారపు పోచయ్య,లింగాల నరేందర్, గిన్నారపు శంకర్, అందె రవీందర్, గిన్నారపు సాయి చిట్యాల దేవేందర్, అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ భారతదేశంలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం భారతదేశ ప్రజలే నా పిల్లలుగా భావించి భారత రాజ్యాంగాన్ని అందించిన ప్రపంచ మేధావిని. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈరోజు మనం సమాజంలో ఈ స్థితిలో ఉన్నామంటే అంబేద్కర్ పెట్టిన భిక్షే అని. అంబేద్కర్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పురుషునికి ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ కొమ్ముల రవీందర్, జేరుపోతుల ఐలయ్య, దళిత సంఘాల నాయకులు మాడుగుల సంపత్ కుమార్,తాడూరి చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.