సిరా న్యూస్, గుడిహత్నూర్:
సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకోవాలి
– సత్యరాజ్ ఉపారపు
మహిళలు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్యను అందించడంలో విశేష కృషీ చేసిన సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే ప్రతీ ఒక్కరికి ఆదర్శమని రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సత్యరాజ్ ఉపారపు అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఈ మేరకు సావిత్రి బాయి 137వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కుల, మత వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప దార్శనికురాలు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు రాహుల్, చంద్రశేఖర్, దుర్గ ప్రసాద్, నర్సింగ్, అక్షయ్, శుభం, తదితరులు పాల్గొన్నారు.