సిరా న్యూస్,విజయనగరం;
విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో కొత్తవలస రైల్వే స్టేషన్ లో విశాఖపట్నం భవానీపట్నం పాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లోకో పైలట్ ఎం హెచ్ ఆర్ కృష్ణ అప్రమతం అవడంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో సాయంత్రం 6 నిమిషాల కు బయలుదేరిన గంట వ్యవధిలోనే కొత్తవలస రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదం జరిగింది. కొత్తవలస రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ 5 నుండి బయలుదేరిన బండి రెండో నంబరు లైన్ కు వస్తుండగా ప్రమాదం జరిగింది.
========================