సిరా న్యూస్,తిరుమల;
తిరుమలలో బాలుడు కిడ్నాప్ కలకలం రేపుతుంది. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లా నుంచి వచ్చిన నగేష్ కుటుంబ సభ్యులతో తిరుమల కి వచ్చారు. బీఎస్సీ టు వద్ద వేచి ఉంటున్న సమయంలో మూడు సంవత్సరాల అభినయని గుర్తు తెలియని మహిళ తీసుకెళ్ళిపోయింది. సమాచారం తెలుసుకున్న టిడిపి అధికారులు స్థానిక పోలీసులకి ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన తిరుమల పోలీసులు, బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తిరుమలతో పాటు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్ రేణిగుంట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు.