సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని లింగగూడెం గ్రామంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డు ఎక్కి ఆందోళన చేపట్టారు.ఐదు రోజుల నుంచి నీళ్లు రాకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కనీసం త్రాగేందుకు కూడా నీరు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఖాళీ బిందెలతో గ్రామం లోని ప్రధాన రహదారి పై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.గ్రామంలో నెలకొన్న నీటి సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని అధికారుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.నీటి సమస్యల పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదంటూ రోడ్డు కు అడ్డంగా తాడు కట్టి రాకపోకలు నిలిపి వేసి ఆందోళన చేపట్టారు.