సిరా న్యూస్,యాదాద్రి;
మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలం లోని లక్కారం, చౌటుప్పల్, తంగడపల్లి చెరువులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పరిశీలించారు. తరువాత రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు లో చాలా కాలంగా చెరువులను పట్టించుకోనీ కారణంగా అడుగంటిపోయాయ్. ప్రతి వర్షపు నీటి చుక్కను చెరువులో నింపే బాధ్యత ప్రభుత్వం పై ఉన్నది. గొలుసు కట్టు పద్ధతి ద్వారా అన్ని చెరువులలో నీటిని నింపాల్సిన అవసరం ఉన్నది. చెరువులను సుందరీ కరణ చేసి ఆహ్లాదకరంగా పార్కులను ఏర్పాటు చేయాల్సింది. బెంగుళూరు కు చెందిన ఆనంద్ మల్లిగం అనే “లెక్ మెన్ ఆఫ్ బెంగుళూర్” సిటీ గా పెరోధింన నిపుణులతో పరిశీలించడం జరిగింది. త్వరలో ప్రణాళిక సిద్ధం చేసి చెరువులను నింపి నీటి సమస్యను తగ్గిస్తామని అన్నారు.
======================