సిరా న్యూస్, కళ్యాణదుర్గం
సురేంద్రబాబు గెలుపు కోసం కృషి చేయాలి
* బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు బంగారు మల్లారెడ్డి
ఉమ్మడి అభ్యర్థి అయిన అమిలినేని సురేంద్రబాబు గెలుపు కోసం చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బంగారు మల్లారెడ్డి అన్నారు. సోమవారం భారతీయ జనతా పార్టీ కళ్యాణ్ దుర్గం అసెంబ్లీ ముఖ్య నాయకుల సమావేశం కళ్యాణ్ దుర్గం పట్టణంలోని సప్తగిరి లాడ్జిలో నిర్వహించారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆధ్వర్యంలో బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు పొత్తు లు కుదుర్చుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు చేయవలసిన కార్యాచరణ గురించి చర్చించారు. పార్టీని సంస్థాగత నిర్మాణం గురించి బిజెపి, టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన అమిలినేని సురేంద్రబాబు గెలుపుకు చేయవలసిన ప్రచారం గురించి పలు విషయాలను చర్చించారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు బంగారు మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి తలారి సోము, కళ్యాణదుర్గం అసెంబ్లీ కన్వీనర్ ముప్పూరి దేవరాజ్ కో కన్వీనర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ పట్టణ అధ్యక్షులు కే రామకృష్ణ, సీనియర్ నాయకులు వై నరసింహమూర్తి యాదవ్ పాణ్యం రంగనాథ్ శర్మ చెక్క సుబ్రహ్మణ్యం,దండు కర్రే గౌడ్ టీజే చక్రవర్తి మండల అధ్యక్షులు సుధాకర్, రామదాసు గోపాల్ చక్రవర్తి సుమన్ కృష్ణ, మనోహర్ రెడ్డి, సత్య ప్రకాష్ రవి, పశువుల సునీల్ బోయే, సుబ్రహ్మణ్యం, తలారి కిష్టప్ప ,తలారి రాము మనోజ్, శివ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.