సిరా న్యూస్, కళ్యాణదుర్గం
పాత పంథా మళ్లీ పునరావృతమైతే చట్టపరమైన చర్యలు
* జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్
* రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
పాత పంథా మళ్లీ పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ సూచించారు. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని రౌడీషీటర్లను పోలీసు స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ చేపట్టాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశించారు. ఈమేరకు సోమవారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. త్వరలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి గొడవలు, నేరాల జోలికెళ్లకుండా రౌడీషీటర్లపై నిఘా వేయండి, పాత నేర పంథాకు స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించేలా సూచించారు. వీరి గత నేర చరిత్ర, ప్రస్తుత జీవన విధానం, స్థితిగతులపై ఆరా తీయాలన్నారు. ఏ చెడు పని చేసినా పోలీసులకు తెలిసిపోతుందనే విషయం తెలియజేయాలన్నారు. డబ్బు కోసం హత్యలకు పాల్పడితే కిరాయి హంతకులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని చెప్పాలన్నారు. రౌడీషీటర్లు బుద్ధిగా జీవించాలి, లేదంటే చట్టపరంగా ఉక్కుపాదం మోపుతాంప్రతీ రౌడీషీటర్ కదలికలపై లోతుగా నిఘా వేయాలని ఆయా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.జిల్లాలో ఎక్కడైనా రౌడీషీటర్లు ఆగడాలు, దౌర్జన్యాలు చేస్తున్నా, పాత పంథా కొనసాగిస్తున్నా సమాచారం తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు.