సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఉదారత చాటిన కేఎస్ఆర్ ఫౌండేషన్ సిబ్బంది
కాంగ్రేస్ పార్టి ఆదిలాబాద్ నియోజక వర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డికి చెందిన కేఎస్ఆర్ ఫౌండేషన్ సిబ్బంది ఆదిత్య రెడ్డి, ఆబిద్, ఇమ్రాన్, గణేష్ జాదవ్, గణేష్లు రక్తదానం చేసి తమ ఉదారత చాటుకున్నారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ అదినేత కంది శ్రీనివాస రెడ్డి ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలతో ఆదిలాబాద్లో అభాగ్యులకు తన వంతుగా అండగా నిలుస్తున్నారు. ఆయన బాటలోనే సిబ్బంది సైతం ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ట్రాక్టర్ బోల్తాపడి కొంత మంది ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్లో చికిత్స పొందుతుండగా, వారికి అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో ఫౌండేషన్ సిబ్బంది రక్తదానం చేసారు. కాగా నిస్వార్థంగా ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసిన సిబ్బందిని కంది శ్రీనివాస రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.