-వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్
సిరా న్యూస్,మంథని;
మంథని మండలం కాకర్లపల్లి గ్రామంలో జరుగుచున్న ఉపాధి హామీ పని ప్రదేశాన్ని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మాట్లాడుతూ రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్నప్పటికీ ఇక్కడ పని ప్రదేశంలో అధికారులు టెంటు ఏర్పాటు చేయలేదని మంచినీటి సౌకర్యం మెడికల్ కిట్లు అందుబాటులో లేవని అన్నారు. వెంటనే పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని వారానికి ప్లే స్లిప్పులు ఇవ్వాలని పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కొలతలను తగ్గించాలని అధికారులను డిమాండ్ చేశారు.అలాగే కేంద్ర బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధులను తగ్గించి పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు.రోజు కూలి 600 రూపాయలు ఇచ్చి పని దినాలను 200 రోజులకు పెంచి కూలీలకు ప్రమాద బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బడుగు సమ్మయ్య, ఎనగందుల రవి,ఇసంపల్లి మహేందర్ లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.