సిరా న్యూస్, ఆదిలాబాద్
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
* జిల్లా పాలనాదికారిగా రాజర్షి షా
* ప్రజల నుంచి అర్జీలను స్వీకరణ
ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా పాలనాదికారిగా రాజర్షి షా అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నూతనంగా జిల్లా పాలనాదికారిగా రాజర్షి షా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి ప్రజావాణి లో పాల్గోని వివిధ మండలాల నుండి వచ్చిన ఆర్జిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా అయా మండలాల నుండి వచ్చిన 22 దరఖాస్తులను స్వీకరించి సంబంధిత అధికారులకు ఇస్తూ అర్జిదారుని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.ప్రజావాణి లో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి , వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.