రాజేంద్రనగర్ లో కత్తి పోట్ల కలకలం

సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో మంగళవారం తెల్లవారుజామున నితీష్ అనే యువకుడి పై కత్తులతో దాడి జరిగింది. దుండగులు విచక్షణారహితంగా నితీష్ పై కత్తితో దాడి చేసారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఎన్ యం గూడ చౌరస్తా లో ఘటన జరిగింది. కత్తి పోట్లకు గురైన నితీష్ ను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా వుంది. కత్తిపోట్లకు గురైన వ్యక్తి స్టార్ హోటల్ రెస్టారెంట్ లో వెయిటర్ గా పని చేస్తున్నట్లు గుర్తించారు. అత్తాపూర్ పోలీసులు సిసి టీవీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్నారు.
==================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *