అన్నమయ్య;
ములకలచెరువు మండలం తుమ్మనంగుట్ట రైల్వే స్టేషన్ సమీపంలోని కోళ్ల ఫామ్ వద్ధ వ్యక్తి నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో మోది చంపారు. మృతుడు బురకాయలకోట సమీపంలోని మొరవపల్లి కి చెందిన రాజారెడ్డిగా గుర్తించారు. రాజారెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడుగా ఉండటంతో ఘటనా స్థలానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మొలకలచెరువు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.