ఇసుక తవ్వకాలతో రైతులకు నష్టం

సిరా న్యూస్,పెద్దపల్లి;
మానేరు పరివాహక, ఉప నదులు, హుస్సేన్ మియా వాగు, చలి వాగు ప్రాంతాల్లో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలతో రైతులకు నష్టం వాటిల్లుతోందని ముత్తారం మండల కేంద్రానికి చెందిన మాజీ సింగిల్ విండో డైరెక్టర్ నాగినేని జగదీశ్వర్ రావు అన్నారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిత్యం వందలాది లారీల్లో ఇసుక తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి యాసంగి పంటలు ఎండిపో తున్నాయి తెలిపారు. వేబిల్లులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అక్రమ ఇసుక రవాణాపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అధికారులు పాటించడంలేదని వాపోయారు. ఇసుక తోడడం వల్ల నీరు లేక బోర్లు ఎండి రైతుల పంటలు చేతికి రాకుండా పోయే ప్రమాదం ఉత్పన్నమయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు ఇసుక తవ్వకాలు నిలిపి వేయాలని, పంటలు ఎండిన రైతులకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బోడ అరవింద్, నీరటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
======================xxx–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *