ఎస్సై లంచం తీసుకున్నాడు

వ్యాపారి ఆరోపణ
సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
సిమెంట్ లారీల విషయంలో పదివేలు లంచం తీసుకున్నాడు అంటూ ములకలపల్లి ఎస్సై పై సిమెంట్ వ్యాపారి ఆరోపించాడు. ములకలపల్లి కి చెందిన కొంతమంది సిసి రోడ్డు నిర్మాణానికి తన వద్ద రెండు లారీలు సిమెంట్ కొనుగోలు చేయగా ములకలపల్లి చేరుకున్న లారీలను ఎస్సై స్టేషన్కు తరలించారని అమ్మకపు మరియు కొనుగోలు రసీదులు చూపించిన మూడు గంటల వరకు లారీలను విడిచిపెట్టకుండా 10000 లంచం ఇచ్చాకే లారీలను బయటకు వదిలారని ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలంటూ బాధితుడు తన ఆందోళన వ్యక్తం చేశాడు…
=================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *