సిరా న్యూస్, బేల
విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ
ఆదిలాబాద్ జిల్లా బేలామండలం సిర్సన్న ఉన్నత పాఠశాలలోని 47 మంది పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆ గ్రామా రెడ్డి సంఘం నాయకులు పరీక్షా సామాగ్రిని అందజేసి ఉదారత చాటుకున్నారు.. పాఠశాల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు క్యాతం సురేష్ రెడ్డి నాయకులతో కలిసి విద్యార్థులకు ఫ్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు ఇతర రాత సామాగ్రిని అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మహాలక్ష్మి, తాజా మాజీ సర్పంచ్ భూమన్న, రెడ్డి సంఘం నేతలు ఎల్టి. కృష్ణారెడ్డి, కాటిపల్లి కృష్ణారెడ్డి, భూమారెడ్డి ఉపాధ్యాయులు సరోజాదేవి, దినేష్,మమత, అజయ్, రమ, రేణుక, సిఆర్పి వెంకన్న, విద్యార్థులు పాల్గొన్నారు