సిరా న్యూస్, సైదాపూర్
రూ.50 వేల విలువ గల పుస్తకాలు అందజేత
వెన్నంపల్లి జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్లోఎన్నారై వాసవి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పుస్తక మిత్ర రీడ్ టు లీడ్ కార్యక్రమం మంగళవారం చేపట్టారు.వెన్నంపల్లి పాఠశాలకు 50 వేల రూపాయల విలువ గల 350 పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు విజ్ఞానంతో పాటుగా భాషాభివృద్ధిని పెంపొందించుకోవాలని, ఈ మిత్ర కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు,ట్రైబల్ పాఠశాలలు, అనాధ పాఠశాలలకు,పుస్తకాలను అందిస్తుందమన్నారు. పాఠశాల గ్రంథాలయాలకి పుస్తకాలను అందించడమే కాకుండా ఆ పుస్తకాల నుండి గ్రహించిన జ్ఞానం ద్వారా స్టోరీ డిస్కషన్,డ్రామాలు, క్రియేటింగ్,నేరేటివ్స్,పోయెట్రీల ద్వారా విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని తద్వారా భావి సమాజానికి మంచి విద్యార్థులను అందించిన వాళ్లమవుతావని అన్నారు.పుస్తక మిత్ర కార్యక్రమంలో పుస్తకాల అందజేసిన పాఠశాల విద్యార్థి పూర్వ విద్యార్థి చిట్టుమల్ల శ్రీనివాస్ సేవల్ని కొనియాడారు.విద్యార్థులు కూడా స్ఫూర్తి దాయకంగా తీసుకుని పాఠశాలకి గ్రామానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ పుస్తక మిత్ర కార్యక్రమంలో పుస్తకాలు అందజేసిన ఈ పాఠశాల పూర్వ విద్యార్థి చిట్టి మల్ల శ్రీనివాస్ సేవల్ని కొనియాడారు. వారిలాగానే విద్యార్థులు కూడా స్ఫూర్తి తీసుకొని తమ పాఠశాలకి తమ గ్రామానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పుస్తకాలను ఎంతగా చదువుకుంటే అంత విజ్ఞానవంతులు అవ్వాలని పుస్తకాలను అద్వితీయంగా ఉపయోగించుకోవాలని ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి జై గోపాల్ సింగ్ అన్నారు. కార్యక్రమంలో వాసవి అసోసియేషన్ ప్రతినిధులు చిట్టుమల్ల రాజ్ కుమార్ ,చిట్టుమల్ల నరసన్న ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. సైదాపూర్ మండల విద్యాధికారి శ్రీ కేతరి వెంకట నరసింహా, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, లైబ్రరీ నిర్వాహకులు సత్య, శివకుమార్, ప్రవీణ్ కుమార్ నాలిని సిఆర్పి రమేష్ పాల్గొన్నారు.