సిరా న్యూస్, ఆదిలాబాద్:
రామకృష్ణ పరమహంస బోధనలు ఆచరణీయం
ధ్యాన గురువు రామకృష్ణ పరమహంస బోధనలు ప్రతీఒక్కరికి ఆచరణీయమని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మెన్ జోగు ప్రేమేందర్ అన్నారు. మంగళవారం రామకృష్ణ పరమ హంస 189 జయంతి సందర్భంగా పట్టణంలో సంజయ్ నగర్లో గల ధ్యాన మందిరంలో నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాజంలో శాంతి స్థాపనకు రామకృష్ణ పరమహంస బోధనలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ప్రతీ ఒక్కరు ఆయన చూపిన మార్గంలో నడవాలన్నారు. ఆయన వెంట నాయకులు ఆరే భూమన్న, లెనిన్, లక్ష్మయ్య, బండారి సతీష్, తదితరులు ఉన్నారు.