సిరాన్యూస్, ఆదిలాబాద్
ముఖ్యమంత్రి, మంత్రులకు కృతజ్ఞతలు
* రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి క్యాతం శివప్రసాద్ రెడ్డి
రెడ్డి కార్పొరేషన్, ఈ.బి.సి ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసినందుకు గానూ బుధవారం రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి క్యాతం శివప్రసాద్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లతో పాటు మిగత మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.