Suhasini Reddy: కాలనీ వాసుల సమస్యలు  పరిష్కరించాలి

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
కాలనీ వాసుల సమస్యలు  పరిష్కరించాలి
* బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి
* క‌లెక్ట‌రేట్ ఎదుట కాల‌నీ వాసుల‌ ధ‌ర్నా
కొమరం భీమ్ కాలనీ వాసుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు,మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ప‌ట్ట‌ణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలని సర్వే నం 72 లో గత కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్న తమకు కనీస వసతులు కల్పించాలని కోరుతూ బుధ‌వారం కాలనీ వాసులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. వారికి ఆమె మద్దతు తెలిపారు.ఈ విషయంపై పలు మార్లు అధికారులను కలిసినా పరిష్కారం అవ్వట్లేదని, జిలా్ల‌ ఇన్చార్జి మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ స్పందించి ఇకనైనా కాలనిలో కనీస సౌకర్యాలు కల్పించి ,కాలనీ వాసుల సమస్యను పరిష్కరించేలా చూడాలని ఆమె కోరారు. ఈ ధ‌ర్నాలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి శివయ్య ముదిరాజ్, ఆదివాసి సంఘాల నాయకులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *