Marupaka Tirupati:ప్రజలకు రవాణా సౌకర్యం ఇంకా సులభతరం

సిరాన్యూస్‌, సైదాపూర్
ప్రజలకు రవాణా సౌకర్యం ఇంకా సులభతరం
* కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మారుపాక తిరుపతి
*హుస్నాబాద్ నుండి హుజూరాబాద్ కు నూత‌న బ‌స్సు
ప్రజలకు రవాణా సౌకర్యం ఇంకా సులభతరమైంద‌ని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మారుపాక తిరుపతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుండి హుజూరాబాద్ కి వయా వెన్నంపల్లి,సోమారం, ఎక్లాస్పుర్ గ్రామాల మీదుగా నూతన బస్సును ఏర్పాటు చేసిన సందర్భంగా బుధ‌వారం వెన్నంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారుపాక తిరుపతి ఘన స్వాగతం పలికి కొబ్బరి కాయలు కొట్టి బస్సును ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గ్రామ శాఖ అధ్యక్షులు మారుపాక తిరుపతి మాట్లాడుతూ,హుస్నాబాద్ నుండి వయా వెన్నంపల్లి హుజురాబాద్ మీదుగా వెళ్లే గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం ఇంకా సులభతరం కానుందని గ్రామ ప్రజలు మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మారుపాక తిరుపతి, సంగాల తిరుపతి, సంగాల మహేష్, అనగోని మహేష్, మొలుగూరి రవి, మొలుగూరి అశోక్, మొలుగూరి కొమురయ్య, మొలుగూరి అయిలయ్య, మొలుగూరి సమ్మయ్య,మారుపాక సమ్మయ్య, శనిగరపు రవి, పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు, మహిళలు ,యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *