మంగళగిరి బైపాస్ లో ఆటో భీభత్సం

సిరా న్యూస్,మంగళగిరి;
మంగళగిరి బైపాస్ రోడ్డులో ఒక ఆటో బీభత్సం సృష్టించింది. మిర్చి లోడుతో విజయవాడ నుంచి మంగళగిరి వైపు వస్తున్న దోస్త్ ఆటో, వద్దేశ్వరం రాధా రంగా నగర్ ఆత్మకూరు హ్యాపీ రీసార్ట్స్ మధ్య అదుపుతప్పింది. రోడ్డు వెంబడి కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని ఢీ కొట్టి నేలబావిలోకి దూసుకెళ్లింది. కూరగాయలు అమ్ముకునే జొన్నకూటి దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. నేల బావిలో ఆటో నీట మునిగింది. పోలీసు, అగ్నిమాపక అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
=================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *